నటుడు సుశాంత్సింగ్కు మాదక ద్రవ్యాలతో సంబంధమున్నదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని ఎన్సీబీ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. సుశాంత్ మృతి కేసును మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ.. రియా సెల్ఫోన్లోని వాట్సాప్ మెసేజీల్లో కొన్నిటిని తొలగించినట్లు గుర్తించింది. వీటిని తిరిగి సంగ్రహించి పరిశీలించగా అవి నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలతో సంబంధమున్నవిగా తేలింది. ఈ సమాచారాన్ని ఈడీ.. ఎన్సీబీకి అందించింది. తాజా పరిణామంతో సుశాంత్సింగ్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ సంస్థల జాబితాలో ఈడీ, సీబీఐ తర్వాత ఎన్సీబీ కూడా చేరినట్లయింది.సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని సీబీఐ వరుసగా ఆరో రోజు బుధవారం కూడా ప్రశ్నించింది. డీఆర్డీవో అతిథి గృహానికి బాంద్రా పోలీసు బృందం కూడా వచ్చి, గంట తర్వాత తిరిగి వెళ్లిందని అధికారులు తెలి పారు. సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన అతని ఫ్లాట్లో సిద్ధార్థ్తోపాటు పనిమనిషులు ఇద్దరు కూడా ఉన్నారు.